శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
అది యింద్రియములతో గూడిన భోక్త. చేతన మగుట చేత నిది జీవుడు"ద్వాసుపర్ణా" యను మంత్రములో నిద్దరు చేతను లున్నారని చెప్పబడెను. ____________________________________________________*ఇది పైచరణమందలి మంత్రము, దీని భావమేమనగా,-నిరంతరము గూడుకొని యుండునవియు మిత్రములు నగు జీవేశ్వరులనెడి రెండుపక్షులు సమానమైనట్టి శరీరమను వృక్షమును యాశ్రయించియున్నవి. దానియందు అవిద్యాకర్మవాసనాశ్రయమైన లింగశరీరో పాధికమైనట్టి జీవరూపమైన పక్షి సుఖదుఃఖముల రూపమగు కర్మఫలము ననుభవించుచున్నది. ఇక రెండవపక్షియగు నీశ్వరరూపమైన పక్షి వివేకమువలన నిత్యముక్తస్వభావము గలదియై, కర్మలను గడువనిదియై సర్వమును చూచుచున్నది అని దీనిభావము. అనగా శరీరమను వృక్షమునందు రెండుపక్షులు కలవు అని జీవేశ్వరు లనంబడునవి. జీవుడను పక్షి కర్మఫలముల ననుభవించు ననియు నీశ్వరుండను పక్షి కర్మఫలముల ననుభవించక నన్నిటనుండి స్వాత్మానందము ననుభవించునని యిందలి సారము.
ReplyDelete