శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
చంపి జయము చేత దేవతలకు శ్రేష్ఠమైన స్వారాజ్యమును బొందెను. బ్రహ్మత్మబోధ తనకుం గలుగుట వలన నజాతశత్రువను నామమును బొందెను. ____________________________________________________*ఇందు "స్వారాజ్యమాప్తవాన్" అని కలదు. స్వరాజ్య మనగా దుచ్ఛమైన యైహికరాజ్యమనియు స్వారాజ్యమనగా బునరావృత్తిలేని యమర రాజ్యమనియు గ్రహించుటతగు. ఇంద్రుడు బ్రహ్మజ్ఞానము లేనంతకాలము కామక్రోధాదులైన రాక్షసులచే బాధపడి, బ్రహ్మజ్ఞానము కలిగిన తదుపరిపైశత్రువులను జయించి దేవతల కర్హమైన, యనగా శాశ్వతానంద ప్రదమైన స్వారాజ్యమును పొందెనని గ్రహించిన, భావము తెల్లమగును. లేనితరి మూలము వమ్ము అగును అ.సు.శ.
ReplyDelete